నేటి నుంచి మరింత బందోబస్తు
ABN , First Publish Date - 2020-03-26T09:14:22+05:30 IST
జిల్లా ఎస్పీ అట్టాడ బాబూజీ బుధవారం అనకాపల్లిలో పర్యటించారు. కరోనా వైరస్ ప్రభావం హైరిస్క్ కేంద్రంగా
ఎస్పీ అట్టాడ బాబూజీ అనకాపల్లిలో పర్యటన
అనకాపల్లి టౌన్, మార్చి 25: జిల్లా ఎస్పీ అట్టాడ బాబూజీ బుధవారం అనకాపల్లిలో పర్యటించారు. కరోనా వైరస్ ప్రభావం హైరిస్క్ కేంద్రంగా అనకాపల్లి రూరల్ను మంత్రులు ప్రకటించడంతో పోలీస్ అధికారులు మరింత అప్రమత్తమై ఇళ్లల్లో నుంచి ఎవరూ బయటకు రాకుండా పటిష్ట చర్యలు చేపట్టారు.
ఎస్పీ బాబూజీ చిననాలుగురోడ్ల జంక్షన్, మెయిన్రోడ్డు, తాకాశివీధి తదితర ప్రాంతాల్లో పర్యటించి పోలీసులకు పలు సూచనలు చేశారు. లాక్ డౌన్ పరిస్థితిని స్వయంగా పరిశీలించారు. గురువారం నుంచి బందోబస్తును మరింత పెంచుతామని, కూరగాయలు, పాలు, కిరాణా సరుకులు కొనుగోలు చేసే వేళలను ప్రజలు కచ్చితంగా పాటించేలా చర్యలు తీసుకోవాలని స్థానిక అధికారులను ఆదేశించారు.