పుంజుకోనున్న పర్యాటకం.. వ్యాపారుల్లో సంతోషం..!

ABN , First Publish Date - 2022-04-13T03:29:08+05:30 IST

పెద్దలందరికీ కొవిడ్ టీకాలను అనుమతించడమే కాకుండా కేంద్ర ప్రభుత్వం బూస్టర్ డోసును కూడా అందుబాటులోకి తేవడంతో దేశీయ పర్యటక రంగంలో హర్షాతిరేకాలు వెల్లువెత్తుతున్నాయి.

పుంజుకోనున్న పర్యాటకం.. వ్యాపారుల్లో సంతోషం..!

ఎన్నారై డెస్క్: పెద్దలందరికీ కొవిడ్ టీకాలను అనుమతించడమే కాకుండా కేంద్ర ప్రభుత్వం బూస్టర్ డోసును కూడా అందుబాటులోకి తేవడంతో దేశీయ పర్యటక రంగంలో హర్షాతిరేకాలు వెల్లువెత్తుతున్నాయి. భారతీయుల అంతర్జాతీయ ప్రయాణాలు కూడా పెరుగుతాయని వారు అంచనా వేస్తున్నారు. ఐరోపా వంటి దేశాలకు ఇంటర్నేషనల్ బుకింగ్స్ పెరుగుతాయని, ప్రయాణాలు చేసేందుకు ప్రజలు ఇకపై వెనుకాడరని ఈ రంగంలోని వ్యాపారస్తులు అంచనా వేస్తున్నారు. త్వరలో  వేసవి సెలవులు మొదలుకానుండటంతో.. బూస్టర్ టీకా ప్రకటన పర్యటకానికి ఊతమిస్తుందని వారు చెబుతున్నారు. వివిధ దేశాల్లో పర్యటనలకు బూస్టర్ డోసులు అవసరమని, ప్రభుత్వ ప్రకటనతో లీజర్, బిజినెస్ ప్రయాణాలు పెరుగుతాయనేది అంచనా. 

Updated Date - 2022-04-13T03:29:08+05:30 IST