మరింత కఠినంగా లాక్డౌన్: పోలీసులు
ABN , First Publish Date - 2020-04-03T20:11:21+05:30 IST
తెలంగాణలో లాక్ డౌన్ను శుక్రవారం నుంచి మరింత కఠినంగా
హైదరాబాద్: తెలంగాణలో లాక్ డౌన్ను శుక్రవారం నుంచి మరింత కఠినంగా అమలు చేసేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. ఇప్పటి వరకు రోడ్ల మీదికి వస్తున్న అనుమానాస్పద వాహనదారులను వాహనాలను సీజ్ చేసి కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఇకపై ట్రాఫిక్ చలానాతో పాటు వాహనదారులను స్థానిక పోలీసులకు అప్పగిస్తారు. స్థానిక పోలీసులు వాళ్లపై ఐపీసీ సెక్షన్ కింద కేసు నమోదు చేసి జైలుకు పంపనున్నారు. ఇవాల్టి నుంచి పోలీసులకు చిక్కితే గరిష్టంగా రెండేళ్లు జైల్ శిక్ష పడే అవకాశం ఉంది.
తెలంగాణలో ఇప్పటి వరకు 25 వేల లాక్ డౌన్ కేసులు నమోదవ్వగా.. 34 వేల వాహనాలను పోలీసులు సీజ్ చేశారు. ఇవాల్టి నుంచి కారణం లేకుండా ఎవరైనా బయటకు వస్తే వారి వాహనాన్ని సీజ్ చేయడంతోపాటు పట్టుబడ్డ వ్యక్తులు నేరుగా జైలుకే వెళ్లాల్సి ఉంటుంది. ఐపీసీ సెక్షన్ 188, 271, 188, ప్రాణoతక వ్యాధులు, ప్రాణాలకు ముప్పు, క్వారంటైన్ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించడం అంశాలపై కేసులు నమోదు చేస్తామని పోలీసులు హెచ్చరించారు.