వచ్చే ఏడాది మరిన్ని కంపెనీలు ఐపీఓ
ABN , First Publish Date - 2020-12-04T06:23:08+05:30 IST
సెకండరీ మార్కెట్లో కనిపిస్తున్న జోష్ ప్రైమరీ మార్కెట్కూ విస్తరిస్తోంది. వచ్చే ఏడాది మరిన్ని కంపెనీలు ఐపీఓకు రాబోతున్నాయి. దాదాపు రూ.30,000 కోట్ల సమీకరణకు ఇప్పటికే 30 కంపెనీలు రంగం సిద్ధం చేసుకున్నాయి.
సెకండరీ మార్కెట్లో కనిపిస్తున్న జోష్ ప్రైమరీ మార్కెట్కూ విస్తరిస్తోంది. వచ్చే ఏడాది మరిన్ని కంపెనీలు ఐపీఓకు రాబోతున్నాయి. దాదాపు రూ.30,000 కోట్ల సమీకరణకు ఇప్పటికే 30 కంపెనీలు రంగం సిద్ధం చేసుకున్నాయి. ఇందులో కల్యాణ్ జువెలర్స్, ఇండిగో పెయింట్స్, స్టోవా క్రాఫ్ట్, సంహి హోటల్స్, అపీజె సురేంద్ర హోటల్స్, నురెక, మిస్టర్స్ బెక్టర్స్ ఫుడ్, జొమాటో వంటి కంపెనీల ఐపీఓలకు ఇప్పటికే సెబీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.