మోరగుడి పీహెచ్‌సీ తనిఖీ

ABN , First Publish Date - 2021-04-17T05:00:12+05:30 IST

మండలంలోని మోరగుడి ప్రాథమిక ఆరోగ్యకేంద్రాన్ని శుక్రవారం తిరుపతి కి చెందిన సీఐడీ ఎస్‌ఐ మురళీమోహన్‌, వారి సిబ్బంది ఆకస్మిక తనిఖీ చేశారు.

మోరగుడి పీహెచ్‌సీ తనిఖీ

జమ్మలమడుగు రూరల్‌, ఏప్రిల్‌ 16: మండలంలోని మోరగుడి ప్రాథమిక ఆరోగ్యకేంద్రాన్ని శుక్రవారం తిరుపతి కి చెందిన సీఐడీ ఎస్‌ఐ మురళీమోహన్‌, వారి సిబ్బంది ఆకస్మిక తనిఖీ చేశారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మెడికల్‌ ఎక్యూప్‌మెంట్‌ పరిశీలించారు. ఈ సందర్భంగా సీఐడీ ఎస్‌ఐ విలేకరులతో మాట్లాడుతూ తిరుపతికి చెంది న సీఐడీ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు జమ్మలమడు గు సబ్‌డివిజన్‌ పరిధిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఏరియా ఆస్పత్రులు తనిఖీకై రావడం జరిగిందన్నారు. 2015 జనవరి నుంచి 2018 డిసెంబరు వరకు ఆయా ఆరో గ్య కేంద్రాలకు వచ్చిన మెడికల్‌ ఎక్యూప్‌మెంట్లు ప్రస్తుతం పనిచేస్తున్నాయా, రిపేరు ఉంటే ఎందుకు చేయించలేదు, తదితర వాటికి సంబందించి రిపోర్టు తయారు చేసి సీఐడీ ఉన్నతాధికారులకు సమర్పించడం జరుగుతుందన్నారు.


Updated Date - 2021-04-17T05:00:12+05:30 IST