అమ్మవారిని దర్శించుకోవడం ఆనందంగా ఉంది : మోపిదేవి

ABN , First Publish Date - 2020-10-19T03:23:05+05:30 IST

నవరాత్రుల్లో అమ్మవారిని దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉందని వైసీపీ రాజ్యసభ ఎంపీ మోపిదేవి వెంకటరమణ అన్నారు.

అమ్మవారిని దర్శించుకోవడం ఆనందంగా ఉంది : మోపిదేవి
file photo

విజయవాడ : నవరాత్రుల్లో అమ్మవారిని దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉందని వైసీపీ రాజ్యసభ ఎంపీ మోపిదేవి వెంకటరమణ అన్నారు. ఇవాళ సాయంత్రం ఇంద్రకీలాద్రిపై అమ్మవారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. అమ్మవారి దర్శనం అనంతరం శివాలయంలో మల్లికార్జున స్వామి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ మర్యాదలతో అధికారులు స్వాగతం పలకగా.. వేద పండితులు ఆశీర్వచనం అందించారు. దర్శనం అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన.. సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ రాష్ట్రం అన్ని రంగాల్లో ముందుకు వెళ్లాలని అమ్మవారిని కోరుకున్నట్లు తెలిపారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు బాగా చేశారని మోపిదేవి చెప్పారు.

Updated Date - 2020-10-19T03:23:05+05:30 IST