పార్టీలకతీతంగా పనిచేసిన మహనీయుడు వైఎస్సార్‌

ABN , First Publish Date - 2021-07-13T13:09:00+05:30 IST

రాజకీయ పార్టీలకు..

పార్టీలకతీతంగా పనిచేసిన మహనీయుడు వైఎస్సార్‌

రాజ్యసభ సభ్యుడు మోపిదేవి


అమృతలూరు: రాజకీయ పార్టీలకు అతీతంగా వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి అమలు చేసిన విధానాలను ఆయన తనయుడు జగన్మోహనరెడ్డి కొనసాగిస్తున్నారని రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకట రమణారావు పేర్కొన్నారు. మండలంలోని మోపర్రు శివారు కేజీ పాలెంలో సోమవారం సాయంత్రం వైఎస్సార్‌ విగ్రహంను ఆయన ఆవిష్కరించారు. అనంతరం జరిగిన సభలో మోపిదేవి మాట్లాడుతూ అభివృద్ధి, సంక్షేమానికి రోల్‌ మోడల్‌ వైఎస్సార్‌ నిలిచారన్నారు. ఎంపీ నందిగం సురేష్‌ మాట్లాడుతూ ఎంపీ నిధులు విడుదల కాగా నే బోడపాడు - మోపర్రు రోడ్డు, కేజీ పాలెంలో పాఠశాల నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తానన్నారు. ఎమ్మెల్యే మేరుగ నాగార్జున, ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్‌ ప్రసంగించారు. కార్యక్రమంలో రాపర్ల నరేంద్ర, గ్యారా ప్రతాప్‌, ఏపీఎం శ్రీమన్నారాయణ, ఎంపీడీవో శ్రీదేవి, డీటీ శివయ్య పాల్గొన్నారు. 

Updated Date - 2021-07-13T13:09:00+05:30 IST