ఏపీలో పండుగ వాతావరణం కనిపిస్తోంది: Mopidevi
ABN , First Publish Date - 2022-05-27T20:19:17+05:30 IST
ఏపీలో పండుగ వాతావరణం కనిపిస్తోందని ఎంపీ మోపిదేవి వెంకటరమణ పేర్కొన్నారు.
గుంటూరు : ఏపీలో పండుగ వాతావరణం కనిపిస్తోందని ఎంపీ మోపిదేవి వెంకటరమణ(Mopidevi Venkataramana) పేర్కొన్నారు. జగన్(Jagan) పాలన మొదలై మూడేళ్లయ్యిందన్నారు. బలహీన వర్గాలను సామాజిక, ఆర్థిక, రాజకీయంగా బలోపేతం దిశగా ప్రభుత్వం పని చేస్తోందన్నారు. సామాజిక న్యాయ భేరి బస్సు యాత్రకు అనూహ్య స్పందన లభిస్తోందన్నారు. పది కాలాల పాటు సీఎంగా జగన్ ఉండాలని గడపగడపకు ప్రభుత్వంలో ప్రజలు ఆశీర్వదిస్తున్నారని మోపిదేవి పేర్కొన్నారు. సామాజిక న్యాయం పాటిస్తున్న వ్యక్తిగా జాతీయ స్థాయిలో జగన్ గుర్తింపు పొందారన్నారు. ఎన్టీఆర్(NTR) పేరును స్మరించే హక్కు చంద్రబాబు(Chandrababu)కు లేదన్నారు. ఎన్టీఆర్ పేరు ప్రస్తావించకుండా ప్రజల్లోకి వెళ్ళే పరిస్థితి లేదన్నారు. సామాజిక న్యాయం గురించి మాట్లాడే నైతిక హక్కు చంద్రబాబుకు లేదని మోపిదేవి వెంకటరమణ పేర్కొన్నారు.