సుబ్రహ్మణ్యేశ్వరుని సేవలో ఎంపీ మోపిదేవి

ABN , First Publish Date - 2020-11-29T06:26:55+05:30 IST

రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణారావు కుటుంబ సమేతంగా సుబ్రహ్మణ్యేశ్వరస్వామిని శనివారం దర్శించుకున్నారు.

సుబ్రహ్మణ్యేశ్వరుని సేవలో ఎంపీ మోపిదేవి

మోపిదేవి : రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణారావు కుటుంబ సమేతంగా సుబ్రహ్మణ్యేశ్వరస్వామిని శనివారం దర్శించుకున్నారు. ఆలయ మర్యాదలతో ఆయనకు ఉద్యోగులు, అర్చకులు స్వాగతం పలికారు. నాగపుట్టలో పాలు పోసి స్వామికి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకులు వేద మంత్రాలతో ఆశీర్వచనం పలికి శేషవస్త్రాలతో ఆయనను సత్కరించారు. ఆలయ సహాయక ఉద్యోగులు మురళి స్వామిచిత్రపటం, ప్రసాదాలు వెంకటరమణకు అందజేశారు.

Updated Date - 2020-11-29T06:26:55+05:30 IST