కర్ణాటక బస్సు ఢీకొని దుప్పి మృతి
ABN , First Publish Date - 2022-01-24T04:19:41+05:30 IST
రోడ్డు దాటుతుండగా కర్ణాటక బస్సు ఢీకొని చారల దుప్పి మృతి చెందింది.
పెద్దదోర్నాల, జనవరి 23 : రోడ్డు దాటుతుండగా కర్ణాటక బస్సు ఢీకొని చారల దుప్పి మృతి చెందింది. మండలంలో ని నల్లమల అటవీ ప్రాంతం లో తుమ్మలబైలు వద్ద ఆదివారం ఈ ఘటన జరిగిం ది. అటవీ శాఖాధికారులు తెలిపిన వివరాల మేరకు.. కర్ణాటకకు చెందిన సింధనూరు ఆర్టీసీ బస్సు శ్రీశైలం నుంచి దోర్నాల వైపు వస్తుండగా తుమ్మలబైలు సమీపంలో చారల దుప్పి ఉన్నఫళంగారో డ్డు దాటుతుండగా బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో దుప్పి అక్కడికక్కడే చనిపోయింది. వెంటనే బస్సును నిలిపివేశారు. అటవీ శాఖాధికారులకు సమాచారం అందజేయడంతో సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. దుప్పిని పశువైధ్యాదికారితో పోస్టుమార్టం నిర్వహించి ఖననం చేశారు. బస్సు డ్రైవర్పై కేసు నమోదు చేశారు.