కుక్కల దాడిలో దుప్పి మృతి
ABN , First Publish Date - 2021-07-26T04:48:14+05:30 IST
సవరడ్డపనస గ్రామం సమీప తోటలో శనివారం రాత్రి దుప్పి మృతి చెందింది. సమీపంలో గల బక్కిరికొండపై నుంచి దుప్పి గ్రామం లో రావడంతో కుక్కలు వెంబడించి దాడి చేయడంతో మృతి చెందినట్టు గ్రామస్థులు చెబుతున్నారు.
సారవకోట (జలుమూరు) : సవరడ్డపనస గ్రామం సమీప తోటలో శనివారం రాత్రి దుప్పి మృతి చెందింది. సమీపంలో గల బక్కిరికొండపై నుంచి దుప్పి గ్రామం లో రావడంతో కుక్కలు వెంబడించి దాడి చేయడంతో మృతి చెందినట్టు గ్రామస్థులు చెబుతున్నారు. సమాచారం తెలుసుకున్న అటవీశాఖ బీట్ అధికారి కేశవరావు, సారవకోట పశువైద్యాధికారి చల్ల కిశోర్ ఘటనా స్థలానికి చేరుకొని దుప్పిని పరిశీలించి కుక్క లు దాడిలో మృతిచెందినట్టు నిర్ధారించారు. పంచనామా నిర్వహించి దుప్పిని దహనం చేశారు.