నాడు-నేడు పనులు పర్యవేక్షించండి

ABN , First Publish Date - 2021-03-06T05:41:35+05:30 IST

పాఠశాలల్లో జరుగుతున్న నాడు-నేడు పనులను ప్రధానో పాధ్యాయులు పర్యవేక్షించాలని కలెక్టర్‌ నివాస్‌ ఆదేశించారు. పాఠశాలలకు ఫర్నిచర్‌, రంగులు సరఫరా చేస్తున్న సంబంధిత కంపెనీల ప్రతినిధులతో కలెక్టర్‌ శుక్రవారం సమీక్షించారు.

నాడు-నేడు పనులు పర్యవేక్షించండి

కలెక్టరేట్‌ : పాఠశాలల్లో జరుగుతున్న నాడు-నేడు పనులను ప్రధానో పాధ్యాయులు పర్యవేక్షించాలని కలెక్టర్‌ నివాస్‌ ఆదేశించారు. పాఠశాలలకు ఫర్నిచర్‌, రంగులు సరఫరా చేస్తున్న సంబంధిత కంపెనీల ప్రతినిధులతో కలెక్టర్‌ శుక్రవారం సమీక్షించారు. అవసరమైన సామగ్రిని  త్వరితగతిన సమకూర్చాలని సూ చించారు. పెయింటింగ్‌, ఫర్నిచర్‌ ఎంతమేర అవసరమో అంచనా వేసి ఇండెంట్‌ ఇవ్వాలని హెచ్‌ఎంలను ఆదేశించారు. ఫర్నిచర్‌ను బిగించేందుకు మండలానికి రెండు బృందా లను ఏర్పాటు చేయాలన్నారు.  అలమరలు తక్కువగా వచ్చాయన్నా రు. నీటి శుద్ధి యంత్రాలను అమర్చేందుకు కనీసం 10 బృందాలను ఏర్పాటు చేయాలని అధికా రులను ఆదేశించారు. జేసీ కె.శ్రీనివాసులు, డీఈవో కె.చంద్రకళ, డిప్యూటీ డీఈవో జి.పగడాలమ్మ, సమగ్ర శిక్షా అభియాన్‌ ఈఈ వి.వెంకటకృష్ణయ్య పాల్గొన్నారు.  

Updated Date - 2021-03-06T05:41:35+05:30 IST