పీఎంజేడీవై ఖాతాల్లో సొమ్ము భద్రం: ఎస్బీఐ
ABN , First Publish Date - 2020-04-10T06:48:37+05:30 IST
నగదు బదిలీ పథకం ద్వారా ప్రధాన మంత్రి జన్ధన్ యోజన (పీఎంజేడీవై) ఖాతాల్లో జమ చేసే నగదును, లబ్ధిదారులు వెంటనే...
హైదరాబాద్: నగదు బదిలీ పథకం ద్వారా ప్రధాన మంత్రి జన్ధన్ యోజన (పీఎంజేడీవై) ఖాతాల్లో జమ చేసే నగదును, లబ్ధిదారులు వెంటనే తీసుకోకపోతే ఆ సొమ్ము ప్రభుత్వానికి బదిలీ అవుతుందన్న వార్తలను ఎస్బీఐ హైదరాబాద్ సర్కిల్ తోసిపుచ్చింది. సర్కిల్ చీఫ్ జనరల్ మేనేజర్ (సీజీఎం) ఓపీ మిశ్రా గురువారం ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. దీనికి సంబంధించిన వచ్చిన పుకార్లను తోసిపుచ్చారు. దీనిపై ఎలాంటి భయాలు అవసరం లేదని, అత్యవసరమైతే తప్ప, ఖాతాదారులు తమ ఖాతాల నుంచి ఈ నగదు విత్డ్రా చేసుకోవాల్సిన అవసరం లేదన్నారు. సామాజిక దూరం పాటించడం కోసం ఖాతాదారులు డిజిటల్ చెల్లింపుల సౌలభ్యాన్ని ఉపయోగించుకోవాలని కూడా మిశ్రా కోరారు.