డబ్బు అలా ఖర్చు పెట్టకూడదు
ABN , First Publish Date - 2021-07-22T07:07:08+05:30 IST
సోషల్ మీడియాలో వివిధ అంశాలపై స్పందిస్తూ చురుగ్గా ఉంటారు పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా.
భారత-అమెరికన్ బంగారు పూత కారుపై ఆనంద్ మహీంద్రా
ముంబై, జూలై 21: సోషల్ మీడియాలో వివిధ అంశాలపై స్పందిస్తూ చురుగ్గా ఉంటారు పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా. తాజాగా ఓ భారతీయ-అమెరికన్కు చెందిన బంగారు పూత పూసిన ఫెరారీ కారుపైనా ఆయన స్పందించారు. ఆ కారులో ఇద్దరు ప్రయాణించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ‘‘ఈ వీడియో సోషల్ మీడియాలో ఎందుకు చక్కర్లు కొడుతోందో నాకు అర్థం కావడం లేదు. మీరు ఎంత ధనవంతులైనప్పటికీ మీ సంపదను అలా ఖర్చుపెట్టకుండా ఉండాలని చూపించేందుకు అయి ఉండవచ్చు’’ అని ట్వీట్ చేశారు. ఆయన ట్వీట్ను సమర్థిస్తూ పలువురు యూజర్లు స్పందించారు. మనం ఎంత ధనవంతులమైనా మన సంపదను అలా ప్రదర్శించకూడదన్నదే ఆనంద్ ఉద్దేశం కావచ్చొంటూ ట్వీట్ చేశారు.