AP News: విజయవాడ రైల్వేస్టేషన్లో డబ్బు స్వాధీనం
ABN , First Publish Date - 2022-08-17T01:54:52+05:30 IST
Vijayawada: విజయవాడ(Vijayawada) రైల్వేస్టేషన్లో భారీగా డబ్బు స్వాధీనం చేసుకున్నారు. ప.గో.జిల్లా నరసాపురానికి చెందిన గోపి నుంచి రూ.94.96 లక్షలను టాస్క్ఫోర్స్ (Taskforce) పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ డబ్బు నరసాపురానికి చెందిన రియల్టర్
Vijayawada: విజయవాడ(Vijayawada) రైల్వేస్టేషన్లో భారీగా డబ్బు స్వాధీనం చేసుకున్నారు. ప.గో.జిల్లా నరసాపురానికి చెందిన గోపి నుంచి రూ.94.96 లక్షలను టాస్క్ఫోర్స్ (Taskforce) పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ డబ్బు నరసాపురానికి చెందిన రియల్టర్ సురేష్దిగా గుర్తించారు. సురేష్ హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు. గోపికి ఫోన్ చేసి హైదరాబాద్కు నగదు తీసుకురావాలని సురేష్ చెప్పాడు. డబ్బును తీసుకు వస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. తర్వాత నగదును ఆదాయపు పన్నుశాఖ అధికారులకు అప్పగించారు.