డబ్బూ వచ్చె.. డుగ్గుడుగ్గు బండీ వచ్చె..
ABN , First Publish Date - 2022-01-18T09:56:53+05:30 IST
‘పందేల్లో గెలుచుకుని వచ్చేస్తవా... డుగ్గు డుగ్గు డుగ్గు డుగ్గుడుగ్గని’ అన్నట్టుగా ఉంది ఈ ఇద్దరి
‘పందేల్లో గెలుచుకుని వచ్చేస్తవా... డుగ్గు డుగ్గు డుగ్గు డుగ్గుడుగ్గని’ అన్నట్టుగా ఉంది ఈ ఇద్దరి వరస. కాసిన ప్రతి పందెంలోనూ కోడి పొడిచింది....‘పేద్ద మొత్తమే’ గిట్టుబాటు అయింది. అంతేనా, ఈ బరివీరుల విజయాలకు మురిసిపోయిన నిర్వాహకులు ఇద్దరికీ చెరో బుల్లెట్ బండి కానుకగా ఇచ్చి మరీ పంపారు. పశ్చిమ గోదావరి జిల్లా సీసలిలో మూడు రోజులుగా నిర్వహిస్తున్న కోడిపందేలకు ముగింపు దృశ్యమిది.
రెండు కేటగిరీలుగా చిన్నపందేలు, పెద్ద పందేలుగా జరిగిన పోటీల్లో కృష్ణా జిల్లా కలిదిండి, పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంకు చెందిన ఇద్దరు ముందు వరుసలో నిలిచారు. ఎవరూ ఊహించనంత పెద్ద మొత్తమే వీరు గెలుచుకున్నారని చర్చించుకుంటున్నారు. వీరికి ఆదివారం రాత్రి స్థానిక ఎమ్మెల్యే మంతెన రామరాజు(టీడీపీ), ఆయన సోదరుడు మంతెన పెద్ద నరసింహరాజు చేతుల మీదుగా రెండు బుల్లెట్లను అందజేశారు. వీరిద్దరూ ఎమ్మెల్యే సోదరులను బైక్లపై ఎక్కించుకుని బరిలో రౌండ్లు వేస్తూ హల్చల్ చేశారు.