13 ఏళ్ల కూతురి స్థానంలో స్కూలుకు వెళ్లిన తల్లి.. ఒక్కరూ గుర్తుపట్టలేదు.. చివరకు ఏం జరిగిందంటే..

ABN , First Publish Date - 2021-06-14T22:42:38+05:30 IST

తన కూతురు చదువుతున్న పాఠశాలలో భద్రతా లోపాలను బయటపెట్టేందుకు ఓ మహిళ సాహసం చేసింది.

13 ఏళ్ల కూతురి స్థానంలో స్కూలుకు వెళ్లిన తల్లి.. ఒక్కరూ గుర్తుపట్టలేదు.. చివరకు ఏం జరిగిందంటే..

తన కూతురు చదువుతున్న పాఠశాలలో భద్రతా లోపాలను బయటపెట్టేందుకు ఓ మహిళ సాహసం చేసింది. తన కూతురి వస్త్రధారణలో ఆమె చదువుతున్న పాఠశాలకు వెళ్లి చివరి పీరియడ్ వరకు క్లాస్‌లో కూర్చుంది. మధ్యలో ప్రిన్సిపాల్‌ను, పాఠశాల సిబ్బందిని పలకరించింది. అయితే వారెవరూ అమెను అనుమానించలేదు. `నువ్వు ఎవర`ని కూడా అడగలేదు. 


టెక్సాస్‌కు చెందిన గార్సియా కళ్లద్దాలు, మాస్క్, హుడీ ధరించి తన 13 ఏళ్ల కూతురిలా సాన్ ఎలిజారియో ఇండిపెండెంట్ స్కూల్‌కు వెళ్లింది. స్కూల్ అంతా కలియతిరిగి అందిరితో మాట్లాడి చివరి పీరియడ్ వరకు ఉంది. అయినా ఆమెను ఎవరూ గుర్తుపట్టలేదు. ఈ విషయం మొత్తాన్ని వీడియో తీసి యూట్యూబ్‌లో పోస్ట్ చేసింది. పాఠశాలలో సెక్యూరిటీ లోపాలను ప్రశ్నించింది. ఈ వీడియోకు రికార్డు స్థాయిలో 2.7 లక్షల వ్యూస్ వచ్చాయి. కాగా, స్కూలు యాజమాన్యం ఫిర్యాదు మేరకు పోలీసులు గార్సియాను అరెస్ట్ చేశారు. అంతేకాదు ఆమెపై 2017లో నమోదైన ట్రాఫిక్ అతిక్రమణ కేసు కూడా పెట్టారు. 8 వేల డాలర్ల జరిమానా విధించారు.  

Updated Date - 2021-06-14T22:42:38+05:30 IST