‘మోల్డ్టెక్’ రైట్స్ ఇష్యూ
ABN , First Publish Date - 2020-10-18T06:40:23+05:30 IST
మోల్డ్టెక్ ప్యాకేజింగ్ రైట్స్ ఇష్యూ జారీ చేయనుంది. ఇష్యూ ఈ నెల 28న ప్రారంభమై నవంబరు 11న
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): మోల్డ్టెక్ ప్యాకేజింగ్ రైట్స్ ఇష్యూ జారీ చేయనుంది. ఇష్యూ ఈ నెల 28న ప్రారంభమై నవంబరు 11న ముగుస్తుంది. రైట్స్ ఇష్యూలో వాటాలు, వారెంట్లను కొనుగోలు చేయడానికి రికార్డు తేదీ అక్టోబరు 22. రూ.5 ముఖ విలువ కలిగిన ఒక్కో షేరును రూ.180కు కొనుగోలు చేయాలి. రైట్స్ ఇష్యూలో ఒక్కో షేరుతోపాటు 6 డిటాచిబుల్ వారెంట్లను కూడా జారీ చేస్తారు.
ఒక్కో వారెంట్ ధర రూ.184. ప్రతి 50 షేర్లకు ఒక షేర్, 6 వారెంట్లను ఇష్యూ చేస్తారు. రూ.71.3 కోట్లకు మించకుండా రైట్స్ ఇష్యూలో నిధులు సమీకరించాలని కమిటీ నిర్ణయించినట్లు కంపెనీ వెల్లడించింది. దరఖాస్తు సమయంలో ముందుగా షేర్కు రూ.45, వారెంట్కు రూ.46 చెల్లిస్తే సరిపోతుంది.
అధీకృత మూలధనాన్ని రూ.14.5 కోట్ల నుంచి రూ.20 కోట్లకు పెంచడానికి సర్వసభ్య సమావేశంలో వాటాదారులు ఆమోదం తెలిపారు.