తండ్రికి నివాళులు అర్పించిన సిరాజ్

ABN , First Publish Date - 2021-01-21T22:34:18+05:30 IST

టీమిండియా క్రికెటర్ సిరాజ్ తన తండ్రికి ఘనంగా నివాళులు అర్పించారు. ఆసీస్ పర్యటన ముగించుకుని గురువారం నగరానికి చేరుకున్న సిరాజ్...

తండ్రికి నివాళులు అర్పించిన సిరాజ్

హైదరాబాద్: టీమిండియా క్రికెటర్ సిరాజ్ తన తండ్రికి ఘనంగా నివాళులు అర్పించారు. ఆసీస్ పర్యటన ముగించుకుని గురువారం నగరానికి చేరుకున్న సిరాజ్... తన తండ్రి సమాధిని దర్శించుకున్నారు. అనంతరం ప్రత్యేక ప్రార్థనలు చేశారు. 


ఆసీస్ పర్యటనలో ఉండగా సిరాజ్ తండ్రి మరణించిన విషయం తెలిసిందే. అయితే కరోనా నిబంధనల కారణంగా తుది వీడ్కోలు పలకడానికి సిరాజ్ భారత్ చేరుకోలేకపోయారు. దీంతో సిరీస్ ముగించుకుని ఇవాళ ఇండియా చేరుకున్నారు. శంషాబాద్‌ ఎయిర్ పోర్టులో  సిరాజ్‌కు  ఘన స్వాగతం లభించింది. క్రీడాభిమానులు, స్నేహితులు, బంధువులు పెద్ద ఎత్తున అభినందనలు తెలిపారు. ఇంటికి చేరుకున్న సిరాజ్.. అక్కడి నుంచి తన తండ్రిని సమాధి చేసిన చోటుకు వెళ్లారు.  

Updated Date - 2021-01-21T22:34:18+05:30 IST