విరాట్‌ అండతో చెలరేగా..

ABN , First Publish Date - 2020-10-23T09:43:04+05:30 IST

బెంగళూరు ఆటగాడు మహ్మద్‌ సిరాజ్‌ బుధవారం కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శన చేశాడు. ఈ హైదరాబాదీ బౌలర్‌

విరాట్‌ అండతో చెలరేగా..

అబుదాబి: బెంగళూరు ఆటగాడు మహ్మద్‌ సిరాజ్‌ బుధవారం కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శన చేశాడు. ఈ హైదరాబాదీ బౌలర్‌ నాలుగు ఓవర్లలో 2 మెయిడెన్లు వేసి ఎనిమిదే పరుగులిచ్చి 3 కీలక వికెట్లు పడగొట్టాడు. కెప్టెన్‌  కోహ్లీ తనపై విశ్వాసం ఉంచి కొత్త బంతి ఇవ్వడంతో చెలరేగానని సిరాజ్‌ తెలిపాడు. ‘2017 తర్వాత కొత్త బంతితో బౌలింగ్‌ చేయడం ఇదే తొలిసారి. మొదటి ఓవర్‌ పూర్తి కాగానే డివిల్లీర్స్‌ వద్దకు వెళ్లి కోహ్లీ నావైపు చూపిస్తూ మాట్లాడాడు. ఆ వెంటనే నన్ను పిలిచి ఈ ఓవర్‌ నువ్వే వేయాలని బంతి చేతిలో పెట్టాడు. వికెట్‌ను చూస్తే పెద్దగా స్వింగ్‌ అయ్యేలా కనిపించలేదు. అయితే, నెట్స్‌లో పార్థివ్‌, పడిక్కళ్‌కు అవుట్‌ స్వింగర్లు వేస్తూ చేసిన సాధన ఈ వికెట్‌పై ఉపయోగపడింది. నెట్స్‌లో వారిని ఇబ్బంది పెట్టిన విధంగానే బౌలింగ్‌ చేసి ఫలితాన్ని రాబట్టా’ అని సిరాజ్‌ చెప్పాడు. గత సీజన్‌లో కోల్‌కతాపై సిరాజ్‌ 2.2 ఓవర్లలో 36 పరుగులిచ్చాడు. కోహ్లీ ఈ విషయాన్ని గుర్తు చేస్తూ సిరాజ్‌లో ఇప్పుడు చాలా మార్పు వచ్చిందని, నెట్స్‌లో అతడు పడుతున్న కష్టానికి తాజా ప్రదర్శన నిదర్శనమని సిరాజ్‌ను ప్రశంసించాడు.

Updated Date - 2020-10-23T09:43:04+05:30 IST