కామారెడ్డి నుంచి పోటీచేస్తా: అజారుద్దీన్
ABN , First Publish Date - 2022-04-04T01:28:17+05:30 IST
వచ్చే ఎన్నికల్లో అధిష్టానం ఆదేశిస్తే కామారెడ్డి నుంచి పోటీచేస్తానని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ క్రికెటర్ అజారుద్దీన్ అన్నారు.
కామారెడ్డి: వచ్చే ఎన్నికల్లో అధిష్టానం ఆదేశిస్తే కామారెడ్డి నుంచి పోటీచేస్తానని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ క్రికెటర్ అజారుద్దీన్ అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. అధిష్ఠానం ఆదేశాల మేరకు ఎక్కడి నుంచైనాపోటీ చేస్తానని ప్రకటించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు కృషిచేస్తున్నామని తెలిపారు. పెరుగుతున్న ధరలతో పేదల మీద భారం పెరుగుతోందని అన్నారు. పార్టీ ఆదేశాలమేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 6న కలెక్టరేట్ల ఎదుట ధర్నా చేస్తామని ప్రకటించారు. టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దెదించుతామని అజారుద్దీన్ స్పష్టం చేశారు.