మెుగలిచర్ల దత్తాత్రేయస్వామి మండల దీక్షలు

ABN , First Publish Date - 2020-03-14T16:34:42+05:30 IST

మహిమాన్విత యోగీశ్వరునిగా, దత్తావధూతగా భక్తుల పూజలందుకుంటున్న మెుగలిచెర్ల దత్తాత్రేయస్వామి వారి

మెుగలిచర్ల దత్తాత్రేయస్వామి మండల దీక్షలు

మెుగలిచెర్ల (ప్రకాశం జిల్లా): మహిమాన్విత యోగీశ్వరునిగా, దత్తావధూతగా భక్తుల పూజలందుకుంటున్న మెుగలిచెర్ల దత్తాత్రేయస్వామి వారి మండల దీక్షలు ఈ నెల 17, 18, 19 తేదీలలో ప్రారంభం కానున్నాయి. దీక్ష తీసుకునే భక్తులకు స్వామివారి సమాధి వద్ద పూజ చేసిన దీక్షామాలలను అందజేస్తామని, స్వామివారి మందిరంలోనే ఈ దీక్ష ఇస్తామని శ్రీదత్తాత్రేయస్వామి మందిర వ్యవస్థాపక ధర్మకర్త పవని నాగేంద్ర ప్రసాద్ తెలిపారు. దీక్ష విరమణ ఏప్రిల్ 29, 30 తేదీల్లో ఉంటుంది. భక్తులు ఈ సదవకాశాన్ని ఉపయోగించుకుని శ్రీ దత్తాత్రేయ స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరారు. మరిన్ని వివరాలకు ఫోనులోనూ (సెల్: 9440266380) సంప్రదించవచ్చని తెలియజేశారు. 


ఇంటిపైన చిలుకలు.. ఇంటి చుట్టూ సర్పం..

 

(ప్రకాశం జిల్లాలో ఉన్న మొగలిచర్ల గ్రామానికి రైలుమార్గంలో అయితే ముందుగా సింగరాయకొండ చేరుకుని అక్కడి నుంచి కందుకూరు మీదుగా వెళ్ళవచ్చు. బస్సులో అయితే నేరుగా కందుకూరు వెళ్ళి అక్కడి నుంచి మొగలిచర్లకు వెళ్ళవచ్చు)

Updated Date - 2020-03-14T16:34:42+05:30 IST