‘టైమ్‌’ జాబితాలో మోదీ, మమత, అదర్‌

ABN , First Publish Date - 2021-09-16T08:41:17+05:30 IST

ఈ ఏడాది అత్యంత ప్రభావశీల వంద మంది వ్యక్తుల జాబితాను ‘టైమ్‌’ మేగజీన్‌ విడుదల చేసింది.

‘టైమ్‌’ జాబితాలో మోదీ, మమత, అదర్‌

ఈ ఏడాది అత్యంత ప్రభావశీలుర జాబితా వెల్లడి

వాషింగ్టన్‌, సెప్టెంబరు 15: ఈ ఏడాది అత్యంత ప్రభావశీల వంద మంది వ్యక్తుల జాబితాను ‘టైమ్‌’ మేగజీన్‌ విడుదల చేసింది. వారిలో భారత ప్రధాని నరేంద్ర మోదీ, కోల్‌కతా ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ అదర్‌ పూనావాలా ఉన్నారు. అలాగే అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌, ఇటలీ ప్రధాని మారియో, ఇజ్రాయెల్‌ ప్రధాని నఫ్తాలీ బెన్నెట్‌, ఇరాన్‌ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ, అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌, అఫ్ఘాన్‌లోని తాలిబాన్‌ ప్రభుత్వ డిప్యూటీ ప్రధాని అబ్దుల్‌ ఘనీ బరాదర్‌ తదితరులు ఈ జాబితాలో ఉన్నారు.

Updated Date - 2021-09-16T08:41:17+05:30 IST