పార్లమెంటు సెంట్రల్ హాలులో నేతాజీకి మోదీ నివాళులు

ABN , First Publish Date - 2022-01-23T17:52:41+05:30 IST

నేతాజీ సుభాష్ చంద్రబోస్ 125వ జయంతిని దేశవ్యాప్తంగా జరుపుకొంటున్నారు. 75వ గణతంత్ర ఉత్సవాలు

పార్లమెంటు సెంట్రల్ హాలులో నేతాజీకి మోదీ నివాళులు

న్యూఢిల్లీ: నేతాజీ సుభాష్ చంద్రబోస్ 125వ జయంతిని దేశవ్యాప్తంగా జరుపుకొంటున్నారు. 75వ గణతంత్ర ఉత్సవాలు కూడా ఆదివారంనాడే ప్రారంభమయ్యారు. నేతాజీ జయంతిని పురస్కరించుకుని పార్లమెంటు సెంట్రల్ హాలులో జరిగిన కార్యక్రమంలో మోదీ, పలువురు కేంద్ర మంత్రులు పాల్గొన్నారు. నేతాజీ పటం వద్ద ప్రధాని మోదీ పుష్పాంజలి ఘటించారు. అనంతరం ఇండియా గేట్ వద్ద నేతాజీ హోలోగ్రామ్ విగ్రహం ఆవిష్కరణకు ఆయన బయలుదేరి వెళ్లారు.

Updated Date - 2022-01-23T17:52:41+05:30 IST