Modi Tourపై అధికారుల మల్లగుల్లాలు
ABN , First Publish Date - 2022-06-28T17:50:31+05:30 IST
ప్రధాని మోదీ(PM Modi) టూర్పై అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. హైటెక్స్లో నేషనల్ మీట్(National Meet) తర్వాత
హైదరాబాద్ : ప్రధాని మోదీ(PM Modi) టూర్పై అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. హైటెక్స్లో నేషనల్ మీట్(National Meet) తర్వాత రాజ్భవన్(Rajbhavan)లో మోదీ బస చేయాల్సి ఉంది. రాజ్భవన్లో బస చేస్తే భద్రతా సమస్యలు వస్తాయని పోలీసులు చెబుతున్నారు. రాజ్భవన్ సెంటర్ ఏరియా కావడంతో నిరసనలకు అవకాశం ఉంటుందని.. ఎస్పీజీకి రాష్ట్ర పోలీస్ అధికారులు సమాచారం పంపారు. ఈడీ విచారణలు, అగ్నిపథ్ నిరసనల దృష్ట్యా.. రాజ్భవన్లో ప్రధాని బసపై పునరాలోచించాలని రాష్ట్ర పోలీసులు కోరారు.