మోదీ సూత్రధారి, కేసీఆర్ పాత్రధారి: రేవంత్‌రెడ్డి

ABN , First Publish Date - 2022-02-05T00:06:22+05:30 IST

రాజ్యాంగం అవసరంలేదనే నియంతృత్వ ధోరణితో కేసీఆర్‌ వ్యాఖ్యలు చేశారని

మోదీ సూత్రధారి, కేసీఆర్ పాత్రధారి: రేవంత్‌రెడ్డి

హైదరాబాద్: రాజ్యాంగం అవసరంలేదనే నియంతృత్వ ధోరణితో కేసీఆర్‌ వ్యాఖ్యలు చేశారని టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి అన్నారు. కేసీఆర్ మాటల వెనుక పెద్ద కుట్ర ఉందన్నారు. దీనికి మోదీ సూత్రధారి, కేసీఆర్ పాత్రధారి అని ఆయన ఆరోపించారు. రాజ్యాంగాన్ని కాపాడడానికి కాంగ్రెస్‌ సిద్ధమని ఆయన ప్రకటించారు. కేసీఆర్‌ని కేకే, కడియం సమర్థించడం సరికాదన్నారు. పదవుల కోసం ఇలా దిగజారడం పద్ధతి కాదన్నారు. రాజ్యాంగం లేకపోతే తెలంగాణ వచ్చేదే కాదన్నారు. రాజ్యాంగం వల్లే కేసీఆర్ రెండుసార్లు సీఎం అయ్యారని ఆయన పేర్కొన్నారు. పదవులున్నాయని విర్రవీగితే ప్రజలే బుద్ధి చెబుతారని ఆయన హెచ్చరించారు. శనివారం కేసీఆర్‌, టీఆర్ఎస్‌ నేతలపై అన్ని పీఎస్‌లలో ఫిర్యాదు చేస్తామని ఆయన తెలిపారు. ఆదివారం  అంబేద్కర్ విగ్రహాలకు పాలాభిషేకం చేస్తామన్నారు. సోమవారం పార్లమెంట్‌లో కేసీఆర్‌పై నిరసన తెలుపుతామని రేవంత్‌ పేర్కొన్నారు. 

Updated Date - 2022-02-05T00:06:22+05:30 IST