పథకాలు మోదీవి.. స్టిక్కర్లు జగన్‌వి: సోమువీర్రాజు

ABN , First Publish Date - 2022-04-08T02:15:17+05:30 IST

రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం వివిధ పథకాలను అమలు చేస్తోంది. వీటిపై ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ఫొటోలతో స్టిక్కర్లు అతికించుకుని

పథకాలు మోదీవి.. స్టిక్కర్లు జగన్‌వి: సోమువీర్రాజు

శ్రీకాకుళం: ‘రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం వివిధ పథకాలను అమలు చేస్తోంది. వీటిపై ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ఫొటోలతో స్టిక్కర్లు అతికించుకుని తన పథకాలుగా ప్రచారం చేసుకోవడం సిగ్గుచేటు’ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు విమర్శించారు.  గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘గత,  ప్రస్తుత ప్రభుత్వాల వైఫల్యాల వల్ల వంశధార నిర్వాసితులు అన్యాయానికి గురవుతున్నారు. ఎన్నికల హామీలను అమలుచేయకపోవడం అన్యాయం. వంశధార రిజర్వాయర్‌ పనులు ఇంకా 9 శాతం పూర్తిచేయాల్సి ఉంది. ఇందుకోసం రూ.45కోట్లు అవసరం. సీఎం జగన్మోహన్‌రెడ్డి ప్రకటనలకు పెట్టే ఖర్చు.. సాగునీటి ప్రాజెక్టులకు కేటాయిస్తే రాష్ట్రం సస్యశ్యామలం అవుతుంది. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే రెండేళ్లలో ప్రాజెక్టులన్నీ పూర్తిచేస్తాం. నిర్వాసితులకు న్యాయం చేస్తాం’ అని సోమువీర్రాజు తెలిపారు.

Updated Date - 2022-04-08T02:15:17+05:30 IST