దేశంలో 12 కోట్ల మందికి టీకా అందింది: మోదీ

ABN , First Publish Date - 2021-04-21T02:36:29+05:30 IST

దేశంలో 12 కోట్ల మందికి టీకా అందింది: మోదీ

దేశంలో 12 కోట్ల మందికి టీకా అందింది: మోదీ

న్యూఢిల్లీ: దేశంలో 12 కోట్ల మంది ప్రజలకు కోవిడ్ టీకా అందిందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. దేశంలో విజృంభిస్తున్న కోవిడ్ రెండవ దశపై మంగళవారం ప్రధానమంత్రి నరేంద్రమోదీ దేశాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మే 1 నుంచి దేశంలో 18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ టీకాలు వేస్తామని హామీ ఇచ్చారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో వీలైనంత తొందరలో దేశ ప్రజలకు టీకాలు అందుతాయని పేర్కొన్నారు.


దేశంలో మేక్ ఇన్ ఇండియాలో భాగంగా రెండు కోవిడ్ టీకాలు తయారయ్యాయని.. వీటి సాయంతో ప్రపంచంలోనే అతి పెద్ద టీకా డ్రైవ్ కార్యక్రమం ఇండియాలో కొనసాగుతోందని మోదీ అన్నారు.

Updated Date - 2021-04-21T02:36:29+05:30 IST