మోదీ, దేశం నీ అబ్బ సొత్తు కాదు: కేసీఆర్‌

ABN , First Publish Date - 2022-02-12T22:54:43+05:30 IST

ప్రధాని మోదీ ప్రభుత్వానికి పిచ్చి ముదురుతోందని సీఎం కేసీఆర్ దుయ్యబట్టారు. యాదాద్రి జిల్లాలో కేసీఆర్ పర్యటించారు.

మోదీ, దేశం నీ అబ్బ సొత్తు కాదు: కేసీఆర్‌

యాదాద్రి: ప్రధాని మోదీ ప్రభుత్వానికి పిచ్చి ముదురుతోందని సీఎం కేసీఆర్ దుయ్యబట్టారు. యాదాద్రి జిల్లాలో కేసీఆర్ పర్యటించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ పిచ్చి పిచ్చి పాలసీలు తీసుకొస్తున్నారని తప్పుబట్టారు. ‘‘మోదీ, దేశం నీ అబ్బ సొత్తు కాదు. లాఠీ, లూటీ, మతపిచ్చి.. ఇదే బీజేపీ సిద్ధాంతం. ప్రజా సమస్యలను పక్కనపెట్టి..మత రాజకీయాలు చేస్తున్నారు. బీజేపీ ప్రభుత్వాన్ని ప్రజలు తరిమి కొట్టాలి. మోదీ చేతగానితనం వల్లే దేశంలో కరెంట్‌ కోతలు, నీళ్ల తగాదాలు వస్తున్నాయి. అభివృద్ధిలో భారత్‌ స్థానం 101. అన్నిరంగాల్లో తెలంగాణ అభివృద్ధి చెందుతోంది. రైతుబంధుతో గ్రామాలు పచ్చబడ్డాయి. ఉద్యోగులకు సంబంధించి చిన్న చిన్న సమస్యలున్నాయి. 40 ఏళ్లపాటు పనిచేసిన ప్రభుత్వ ఉద్యోగుల సర్వీస్ రూల్స్ సరళీకరిస్తాం’’ అని కేసీఆర్ ప్రకటించారు.



Updated Date - 2022-02-12T22:54:43+05:30 IST