మోదీ వైఎస్ఆర్ను చాలాసార్లు పొగిడారు: విజయలక్ష్మి
ABN , First Publish Date - 2021-09-03T00:58:57+05:30 IST
ప్రధాని మోదీ కూడా దివంగత మాజీ సీఎం వైఎస్ఆర్ను చాలాసార్లు పొగిడారని వైఎస్ విజయలక్ష్మి గుర్తుచేశారు. విజయలక్ష్మి ఆధ్వర్యంలో
హైదరాబాద్: ప్రధాని మోదీ కూడా దివంగత మాజీ సీఎం వైఎస్ఆర్ను చాలాసార్లు పొగిడారని వైఎస్ విజయలక్ష్మి గుర్తుచేశారు. విజయలక్ష్మి ఆధ్వర్యంలో హైదరాబాద్లోని హైటెక్స్లో వైఎస్ఆర్ 12 వర్థంతిని నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా విజయలక్ష్మి మాట్లాడుతూ లెక్కలేనన్ని సంక్షేమ పథకాలకు వైఎస్ఆర్ ఆద్యుడని కొనియాడారు. వైఎస్ఆర్ మన మధ్య లేకున్నా ఆయన పనులు మాట్లాడుతూనే ఉన్నాయని తెలిపారు. తనను తన బిడ్డలను ఆయనకంటే ఎక్కువగా ప్రజలు ప్రేమిస్తున్నారని ఆదరిస్తున్నారని పేర్కొన్నారు. ఇది ఎప్పటికీ తాను మరవలేనని, తమ కుటుంబం దీనిని ఎన్నటికీ మర్చిపోదన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో వైఎస్ఆర్ని తలవకుండా ఉండలేరని, రెండు రాష్ట్రాల్లో ఏదో ఒక సందర్భంలో వైఎస్ఆర్ ప్రస్తావన తెస్తూనే ఉంటారని తెలిపారు. మాజీ ప్రధాని రాజీవ్గాంధీ కూడా వైఎస్ఆర్ను బాగా గుర్తుచేసేవారని పేర్కొన్నారు. మాజీ ప్రధాని మన్మోహన్సింగ్ కూడా బాగా తలుచుకుంటుంటారని విజయలక్ష్మి గుర్తుచేశారు.