Modi : నేరస్థుల్లో భయం పుట్టించారు

ABN , First Publish Date - 2021-08-05T23:13:33+05:30 IST

ముఖ్యమంత్రి యోగిపై ప్రధాని మోదీ ప్రశంసలు కురిపించారు. ప్రజలు తమని తాము సుసంపన్నం

Modi : నేరస్థుల్లో భయం పుట్టించారు

న్యూఢిల్లీ : ముఖ్యమంత్రి యోగిపై ప్రధాని మోదీ ప్రశంసలు కురిపించారు. ప్రజలు తమని తాము సుసంపన్నం చేసుకునే విధంగా యోగి పాలన సాగుతోందని పేర్కొన్నారు. ప్రధాని మోదీ గురువారం ‘పీఎం గరీబ్ కల్యాణ్ అన్న యోజన’ పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... యూపీలోని డబుల్ ఇంజన్ రాష్ట్రాన్ని చూసే దృక్పథాన్నే మార్చేసిందన్నారు. రాష్ట్రం సమర్థవంతమైన రాష్ట్రంగా మారగలదన్న విశ్వాసాన్ని యోగి కొన్ని రోజులుగా పాదుకొల్పుతున్నారని, నేరస్థుల్లో భయానక వాతావరణాన్ని మొదటి సారిగా సృష్టించారని మోదీ కితాబునిచ్చారు. బంధుప్రీతి, అవినీతికి అలవాటుపడ్డ  వ్యవస్థను ఓ అర్థవంతమైన వ్యవస్థగా మార్చేశారని పేర్కొన్నారు. యోగి పాలనలో నేరుగా ప్రజల అకౌంట్లలోకే డబ్బులు చేరే విధంగా చూస్తున్నారని అన్నారు. యూపీ పెట్టుబడులకు ప్రధాన కేంద్రంగా మారిందని, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కంపెనీలు యూపీలో పెట్టుబడులు పెట్టడానికి మొగ్గు చూపుతున్నాయని అన్నారు. గతంలో యూపీ అంటే కేవలం రాజకీయం మాత్రమే గుర్తొచ్చేదని, ఇప్పుడు మాత్రం దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తోందని మోదీ అన్నారు. 

Updated Date - 2021-08-05T23:13:33+05:30 IST