ఈ క్షణాలను ఎప్పటికీ మరువను!

ABN , First Publish Date - 2022-05-22T09:34:33+05:30 IST

బధిరుల ఒలింపిక్స్‌లో అద్భుత ప్రదర్శన కనబరచిన భారత బృందం ప్రధాని నరేంద్ర మోదీని శనివారం కలిసింది.

ఈ క్షణాలను ఎప్పటికీ మరువను!

బధిర అథ్లెట్లతో భేటీపై మోదీ

న్యూఢిల్లీ: బధిరుల ఒలింపిక్స్‌లో అద్భుత ప్రదర్శన కనబరచిన భారత బృందం ప్రధాని నరేంద్ర మోదీని శనివారం కలిసింది. ఈనెల ఒకటి నుంచి 15 వరకు బ్రెజిల్‌లో జరిగిన ఈ క్రీడల్లో భారత్‌ అత్యుత్తమంగా 16 పతకాలు సాధించింది. తమ ప్రదర్శనతో అథ్లెట్లు దేశానికి ఎనలేని కీర్తి ప్రతిష్ఠలు తీసుకొచ్చారని ఈ సందర్భంగా ప్రధాని వారిని ప్రశంసించారు. ‘చాంపియన్లు అయిన ఈ అథ్లెట్లను కలుసుకోవడం నేను ఎప్పటికీ మరువలేను. ఒలింపిక్స్‌లో తమ అనుభవాలను వారు నాతో పంచుకున్నారు. క్రీడల పట్ల వారి అనురక్తి, పట్టుదల చూసి నాకు ముచ్చటేసింది’ అని ప్రధాని ట్వీట్‌ చేశారు. కేంద్ర క్రీడల మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు. 

Updated Date - 2022-05-22T09:34:33+05:30 IST