లోక్‌సభలో మోదీకి అనుకూలంగా నినాదాలు

ABN , First Publish Date - 2022-03-14T22:00:25+05:30 IST

న్యూఢిల్లీ: పార్లమెంట్ సమావేశాల తొలి రోజు లోక్‌సభలో ప్రధానమంత్రి నరేంద్రమోదీకి అనుకూలంగా బీజేపీ ఎంపీలు నినాదాలు చేశారు.

లోక్‌సభలో మోదీకి అనుకూలంగా నినాదాలు

న్యూఢిల్లీ: పార్లమెంట్ సమావేశాల తొలి రోజు లోక్‌సభలో ప్రధానమంత్రి నరేంద్రమోదీకి అనుకూలంగా బీజేపీ ఎంపీలు నినాదాలు చేశారు.  ప్రధాని మోదీ సభలోకి ప్రవేశించగానే సభ్యులు భారత్ మాతా కీ జై అంటూ నినాదాలు చేశారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా, రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఇతర కేంద్ర మంత్రులు కిరణ్ రిజుజు, అనురాగ్ సింగ్ ఠాకూర్ తదితరులు మోదీ-మోదీ అంటూ నినాదాలు చేశారు. బల్లలు చరుస్తూ సందడి చేశారు. ప్రధాని మోదీ వారికి అభివాదం చేసి తన సీటులో కూర్చున్నారు. ఇటీవలి 5 రాష్ట్రాల ఎన్నికల్లో నాలుగింటిని బీజేపీ తిరిగి నిలబెట్టుకుంది. దీంతో బీజేపీ సభ్యులు తమ ఆనందాన్ని లోక్‌సభలో వ్యక్తం చేస్తూ నినాదాలు చేశారు.   





Updated Date - 2022-03-14T22:00:25+05:30 IST