ఫ్లోర్ లీడర్లకు ‘కోవిడ్ ప్రెజెంటేషన్’ ఇవ్వనున్న Modi

ABN , First Publish Date - 2021-07-19T21:37:19+05:30 IST

అన్ని పార్టీల ఫ్లోర్ లీడర్లతో ప్రధాని నరేంద్ర మోదీ భేటీ కానున్నారు. ఈ భేటీ బుధవారం జరగనుంది. ఉభయ సభలకు

ఫ్లోర్ లీడర్లకు ‘కోవిడ్ ప్రెజెంటేషన్’ ఇవ్వనున్న Modi

న్యూఢిల్లీ : అన్ని పార్టీల ఫ్లోర్ లీడర్లతో ప్రధాని నరేంద్ర మోదీ భేటీ కానున్నారు. ఈ భేటీ బుధవారం జరగనుంది. ఉభయ సభలకు చెందిన ఫ్లోర్ లీడర్లు పాల్గొంటారు. కోవిడ్ వ్యాక్సిన్ పాలసీ, కోవిడ్ చర్యలు, కోవిడ్ కేసులతో పాటు మరికొన్ని కీలకమైన విషయాలను ఈ సమావేశం చర్చించనుంది. అంతేకాకుండా వ్యాక్సినేషన్, కోవిడ్ చర్యలు అనే అంశాలపై ప్రధాని మోదీ ఓ ప్రెజెంటేషన్ కూడా ఇవ్వనున్నారు. కరోనా సెకండ్ వేవ్‌ను అరికట్టడంలో మోదీ సర్కార్ విఫలమైందని పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో కోవిడ్ కట్టడికి చేపట్టిన చర్యలను ఓ ప్రెజెంటేషన్ రూపంలో మోదీ ఫ్లోర్ లీడర్ల ముందు ఉంచనున్నారు. 

Updated Date - 2021-07-19T21:37:19+05:30 IST