మోదీతో దీదీ భేటీ
ABN , First Publish Date - 2021-07-27T21:46:48+05:30 IST
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ భేటీ అయ్యారు. మూడోసారి సీఎం అయ్యాక ఆమె మోదీతో భేటీ కావడం ఇదే తొలిసారి.
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ భేటీ అయ్యారు. మూడోసారి సీఎం అయ్యాక ఆమె మోదీతో భేటీ కావడం ఇదే తొలిసారి. పశ్చిమబెంగాల్లో రాజకీయ హింస, కరోనా పరిస్థితులు, పెగాసస్ స్పైవేర్ ఉదంతంపై చర్చించే అవకాశాలున్నాయి.
పశ్చిమబెంగాల్లో ఎన్నికల వేళ మోదీ-దీదీ మధ్య మాటల యుద్ధం సాగింది. విమర్శలు పతాక స్థాయికి చేరుకున్నాయి. బీజేపీ, టీఎంసీ నేతలు ఒకరిపై మరొకరు దుమ్మెత్తిపోసుకున్నారు. ఎన్నికలకు ముందు, తర్వాత కూడా రాజకీయ హింస నెలకొంది. తమ పార్టీవారిని అధికార పార్టీ లక్ష్యంగా చేసుకుని దాడులు కొనసాగించిందని బీజేపీ ఆరోపించింది. దీనిపై రగడ కొనసాగుతుండగానే పెగాసస్ ఉదంతం తెరపైకొచ్చింది. దీంతో తృణమూల్ సర్కారు దీనిపై విచారణకు కూడా ఆదేశించింది. ఈ తరుణంలో దీదీ ప్రధాని మోదీని కలవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. మమత బుధవారం సాయంత్రం 4 గంటలకు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీని కలుసుకోనున్నారు.