మోదీ చెప్పేవన్నీ గాలి మాటలే: కేటీఆర్
ABN , First Publish Date - 2022-04-20T21:29:58+05:30 IST
ప్రధాని మోదీపై మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. మోదీ చెప్పేవన్నీ గాలి మాటలేనని, పెట్రోల్ ధరలు పెంచారని దుయ్యబట్టారు. నర్సంపేటలో టీఆర్ఎస్ ఆధ్వర్యంలో బహిరంగ సభ నిర్వహించారు.
వరంగల్: ప్రధాని మోదీపై మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. మోదీ చెప్పేవన్నీ గాలి మాటలేనని, పెట్రోల్ ధరలు పెంచారని దుయ్యబట్టారు. నర్సంపేటలో టీఆర్ఎస్ ఆధ్వర్యంలో బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ గ్యాస్ ధరలు తగ్గిస్తానన్న మోదీ డబుల్ చేశారని మండిపడ్డారు. 2 కోట్ల నిరుద్యోగులను బీజేపీ మోసం చేసిందని ధ్వజమెత్తారు. ఎన్నికలు లేకున్నా అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని తెలిపారు. నర్సంపేటలో ఇంటింటికి వంట గ్యాస్పైప్ లైన్ ఇస్తామని చెప్పారు. టీఆర్ఎస్ సభలో మంత్రులు కేటీఆర్, ఎర్రబెల్లి, సత్యవతి రాథోడ్ పాల్గొన్నారు.