ముఖ్యమంత్రికి మదమెక్కిందా?
ABN , First Publish Date - 2022-02-06T08:04:03+05:30 IST
ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటనకు సీఎం కేసీఆర్ హాజరుకాక పోవడంపై..
ప్రధానికి స్వాగతం పలకకుండా డ్రామాలా?
కేసీఆర్ను తెలంగాణ సమాజం క్షమించదు: బండి
ఏం చూసుకొని అహంకారం?: బండి సంజయ్
(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి): ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటనకు సీఎం కేసీఆర్ హాజరుకాక పోవడంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశ ప్రధానిని అవమానించేలా కేసీఆర్ వ్యవహరించారన్నారు. శనివారం శంషాబాద్ విమానాశ్రయంలో విలేకరులతో ఆయన మాట్లాడారు. కేసీఆర్ కోరినప్పుడల్లా ప్రధాని అపాయిమెంట్ ఇస్తే.. ఆయన వచ్చినప్పుడు ఫామ్హౌ్సలో రెస్ట్ తీసుకుంటూ అస్వస్థత అంటూ డ్రామాలాడుతారా? అని ప్రశ్నించారు. ‘‘ప్రధానికి స్వాగతం పలకడానికి సీఎం ఎందుకు రాలేదు? అస్వస్థత అని రాలేదా? మదమెక్కిందా? ఏం చూసుకొని ఈ అహంకారం?’’ అంటూ సంజయ్ మండిపడ్డారు. కేసీఆర్ను తెలంగాణ సమాజం క్షమించదన్నారు.