రైతులను మోదీ, కేసీఆర్ మోసం చేస్తున్నారు: ఉత్తమ్‌

ABN , First Publish Date - 2021-11-20T23:55:17+05:30 IST

పంట కొనుగోళ్లపై మోదీ, కేసీఆర్‌ డ్రామాలాడుతున్నారని కాంగ్రెస్ నేత ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ధ్వజమెత్తారు. శనివారం ఆయన మీడియాతో

రైతులను మోదీ, కేసీఆర్ మోసం చేస్తున్నారు: ఉత్తమ్‌

సూర్యాపేట: పంట కొనుగోళ్లపై మోదీ, కేసీఆర్‌ డ్రామాలాడుతున్నారని కాంగ్రెస్ నేత ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ధ్వజమెత్తారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ రైతులను మోదీ, కేసీఆర్ మోసం చేస్తున్నారని దుయ్యబట్టారు. ఖరీఫ్ పంట కొనుగోలు చేయకుండా రబి పంట గురించి మాట్లాడుతున్నారని, రబి పంట వేయొద్దని చెప్పే అర్హత కేసీఆర్ ప్రభుత్వానికి లేదన్నారు. కేసీఆర్ రైస్ మిల్లర్లతో కుమ్మక్కై రైతులను మోసం చేస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్ ధర్నాలో కూర్చోడం హాస్యాస్పదంగా ఉందన్నారు. 2 లక్షల కోట్ల రాష్ట్ర బడ్జెట్ ఉందని చెబుతున్న కేసీఆర్.. ధాన్యం ఎందుకు కొనుగోలు చేయడం లేదో చెప్పాలి? అని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రశ్నించారు.

Updated Date - 2021-11-20T23:55:17+05:30 IST