బడా బాబులతో మోదీ కుమ్మక్కు: రాహుల్
ABN , First Publish Date - 2021-01-24T08:16:49+05:30 IST
ప్రధాని మోదీ బడా పెట్టుబడిదారులతో కుమ్మక్కై ప్రజలకు చెందిన అన్నింటినీ ఒక్కొక్కటిగా అమ్మేస్తున్నారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ విమర్శించారు...
చెన్నై, జనవరి 23 (ఆంధ్రజ్యోతి): ప్రధాని మోదీ బడా పెట్టుబడిదారులతో కుమ్మక్కై ప్రజలకు చెందిన అన్నింటినీ ఒక్కొక్కటిగా అమ్మేస్తున్నారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ విమర్శించారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారాన్ని ఆయన ప్రారంభించారు. రాష్ట్రంలో మూడు రోజుల పర్యటనలో భాగంగా రాహుల్ శనివారం కోయంబత్తూరు, ఈరోడ్, కరూర్ జిల్లాల్లో పలు రోడ్ షోల్లో ప్రసంగించారు. దేశంలోని 3-4 మంది బడా పెట్టుబడిదారులకు మోదీ ప్రజల సొమ్మును ధారాదత్తం చేస్తుంటే.. వాళ్లు ప్రధానికి విస్తృత ప్రచారం కల్పిస్తున్నారని రాహుల్ ఆరోపించారు.