మోదీ ఫొటో లేదని.. కేసీఆర్ ఫ్లెక్సీ చించివేత
ABN , First Publish Date - 2021-01-19T08:31:50+05:30 IST
ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సోమవారం కరోనా వ్యాక్సినేషన్ ప్రారంభోత్సవంలో టీఆర్ఎస్, బీజేపీ నేతల మధ్య వాగ్వివాదం జరిగింది. కేంద్రం వద్ద ఏర్పాటు చేసిన ఫ్లెక్సీపై ప్రధాని నరేంద్ర మోదీ
వ్యాక్సినేషన్ ప్రారంభంలో టీఆర్ఎస్, బీజేపీ నేతల గొడవ
గుడిహత్నూర్, జనవరి18: ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సోమవారం కరోనా వ్యాక్సినేషన్ ప్రారంభోత్సవంలో టీఆర్ఎస్, బీజేపీ నేతల మధ్య వాగ్వివాదం జరిగింది. కేంద్రం వద్ద ఏర్పాటు చేసిన ఫ్లెక్సీపై ప్రధాని నరేంద్ర మోదీ ఫొటో లేనందుకు బీజేపీ జడ్పీటీసీ సభ్యుడు పతంగే బ్రహ్మనంద్, పీఏసీఎస్ చైర్మన్ ముండే సంజీవ్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసి ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటంతో ఉన్న ఫ్లెక్సీని చింపేశారు. దీంతో టీఆర్ఎస్ ఎంపీపీ రాథోడ్ పుండలిక్, బీజేపీ జడ్పీటీసీ పతంగే బ్రహ్మనంద్ల మధ్య తీవ్ర వాగ్వివాదం జరిగింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో వైద్య సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు వారిని సముదాయించడంతో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం సాఫీగా కొనసాగింది.