బీహార్‌కు మోదీ రెట్టింపు నిధులు కేటాయించారు

ABN , First Publish Date - 2020-10-30T17:28:27+05:30 IST

యూపీఏ పదవీ కాలంతో పోలిస్తే మోదీ ప్రభుత్వం బీహార్ రాష్ట్రానికి ప్రత్యేక ప్రాధాన్యమిచ్చి అధిక నిధులు ఇచ్చిందని...

బీహార్‌కు మోదీ రెట్టింపు నిధులు కేటాయించారు

కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ వ్యాఖ్యలు

పట్నా (బీహార్): యూపీఏ పదవీ కాలంతో పోలిస్తే మోదీ ప్రభుత్వం బీహార్ రాష్ట్రానికి ప్రత్యేక ప్రాధాన్యమిచ్చి అధిక నిధులు ఇచ్చిందని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ చెప్పారు. 2009-14లో యూపీఏ సర్కారు బీహార్ రాష్ట్రానికి రూ.50.008 కోట్లు మంజూరు చేయగా, 2014-2019 లో మోదీ సర్కారు దానికి రెట్టింపుగా 1,09,642 కోట్లను అందించిందని మంత్రి ఠాకూర్ వెల్లడించారు. యూపీఏ బీహార్ రాష్ట్రానికి ఇచ్చిన నిధుల కంటే 119 శాతం పెరుగుదల అని మంత్రి చెప్పారు. ప్రధానమంత్రి జనధన్ యోజన పథకం కింద బీహార్ అత్యధిక ప్రయోజనం పొందిందని మంత్రి చెప్పారు. కొవిడ్ కాలంలో బ్యాంకు ఖాతాల ద్వారా 2.4 కోట్ల మంది లబ్ధిదారులకు డబ్బులు వేశామని మంత్రి వివరించారు. ప్రధానమంత్రి ముద్ర యోజన పథకం కింద 2.4కోట్ల ఖాతాల్లో 92,000కోట్ల రూపాయలు వేశామని మంత్రి చెప్పారు.

Updated Date - 2020-10-30T17:28:27+05:30 IST