సత్యం, న్యాయం, అహింస గెలిచాయి: సోనియా

ABN , First Publish Date - 2021-11-20T00:23:25+05:30 IST

రైతులు, కార్మికులపై అధికారంలో ఉన్న వారి కుట్రలు చిత్తయ్యాయని, నియంత పాలకుల..

సత్యం, న్యాయం, అహింస గెలిచాయి: సోనియా

న్యూఢిల్లీ: రైతులు, కార్మికులపై అధికారంలో ఉన్న వారి కుట్రలు చిత్తయ్యాయని, నియంత పాలకుల అహకారం ఓడిందని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ అన్నారు. సత్యం, న్యాయం అహింస గెలిచాయని అభివర్ణించారు. వివాదాస్పద సాగుచట్టాలను రద్దు చేస్తున్నట్టు ప్రధానమంత్రి మోదీ ప్రకటించడంపై ఆమె స్పందిస్తూ, రైతుల జీవనోపాథి, వ్యవసాయంపై దాడికి జరిగిన కుట్ర ఓటమి పాలైందని అన్నారు. ఇది అన్నదాతల విజయమని ఆమె అభివర్ణించారు.


''ఈరోజు 700 మందికి పైగా అన్నదాతల బలిదానాలు, న్యాయం కోసం జరిపిన పోరాటాలకు తగిన న్యాయం జరిగింది. సత్యం, న్యాయం, అహింస గెలుపు సాధించాయి'' అని సోనియాగాంధీ అన్నారు. ప్రజాస్వామ్యంలో ఏ నిర్ణయం తీసుకున్నా అది సంబంధిత భాగస్వాములు, విపక్షాలతో చర్చించి తీసుకోవాలని, మోదీ ప్రభుత్వం ఇకముందైనా తగిన గుణపాఠాలు నేర్చుకుంటుందని ఆశిస్తున్నానని ఆమె అన్నారు.

Updated Date - 2021-11-20T00:23:25+05:30 IST