మోదీ డ్రామా పీఎం పదవిని దిగ జార్చింది: భట్టి
ABN , First Publish Date - 2022-01-09T20:21:11+05:30 IST
మోదీ పంజాబ్లో చేసిన డ్రామా పీఎం పదవిని దిగ జార్చిందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క దుయ్యబట్టారు.
హైదరాబాద్: మోదీ పంజాబ్లో చేసిన డ్రామా పీఎం పదవిని దిగ జార్చిందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క దుయ్యబట్టారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ పీఎం సభకు జనాలు రాకే కారణం వెతుక్కున్నారని విమర్శించారు. పంజాబ్ సీఎంను నవ్వులపాలు చేయాలని చూశారని, గతంలో మాజీ ప్రధాని ఇందిరాగాంధీపై రాయితో దాడి చేసినా నిందలు వేయలేదని గుర్తుచేశారు. పంజాబ్ ప్రభుత్వం మీద కక్షసాధిస్తున్నారని, పంజాబ్ సీఎం ఫెయిల్ అయినట్టు చూపే కుట్ర చేస్తున్నారని ధ్వజమెత్తారు. పీఎం, బీజేపీ నేతలు డ్రామాలు ఆపాలని భట్టి విక్రమార్క అన్నారు.