దేశ యువతకు మోదీ ప్రత్యేక విజ్ఞప్తి

ABN , First Publish Date - 2021-04-21T02:43:27+05:30 IST

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోవిడ్ కారణంగా మృతి చెందిన వారి కుటుంబ సభ్యుల దు:ఖాన్ని తాను అర్థం చేసుకోగలనని తన సంతాపం వ్యక్తం చేస్తూనే కోవిడ్ సవాల్ చాలా పెద్దదని, అయినప్పటికీ

దేశ యువతకు మోదీ ప్రత్యేక విజ్ఞప్తి

న్యూఢిల్లీ: దేశంలోని యువతకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రత్యేక విజ్ఞప్తి చేశారు. తమ పరిసరాల్లో కొంత మంది కలిసి చిన్న చిన్న గ్రూపులుగా ఏర్పడి కోవిడ్‌పై అవగాహన కల్పించాలని పిలుపునిచ్చారు. ఈ పని చేసి దేశాన్ని లాక్‌డౌన్ నుంచి కాపాడుకుందామని ఆయన విజ్ఞప్తి చేశారు. దేశంలో విజృంభిస్తున్న కోవిడ్ రెండవ దశపై మంగళవారం ప్రధానమంత్రి నరేంద్రమోదీ దేశాన్ని ఉద్దేశించి ప్రసంగించారు.


ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోవిడ్ కారణంగా మృతి చెందిన వారి కుటుంబ సభ్యుల దు:ఖాన్ని తాను అర్థం చేసుకోగలనని తన సంతాపం వ్యక్తం చేస్తూనే కోవిడ్ సవాల్ చాలా పెద్దదని, అయినప్పటికీ ముందస్తు జాగ్రత్తలు, ధైర్యంతో దానిని అధిగమిద్దామని భారోసానిచ్చారు. గతంతో పోలిస్తే ప్రస్తుతం విస్తరిస్తున్న కోవిడ్ చాలా భిన్నమైనదని, దీనిపై అందరం కలిసి పోరాడాలని మోదీ పిలుపు నిచ్చారు.

Updated Date - 2021-04-21T02:43:27+05:30 IST