ఇక నుంచి నైట్ కర్ఫ్యూ కాదు.. కరోనా కర్ఫ్యూ!

ABN , First Publish Date - 2021-04-09T04:41:43+05:30 IST

దేశంలోని కరోనా పరిస్థితులపై వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని నరేంద్ర మోదీ గురువారం కీలక సమావేశం నిర్వహించారు. కరోనా నియంత్రణ కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులకు..

ఇక నుంచి నైట్ కర్ఫ్యూ కాదు.. కరోనా కర్ఫ్యూ!

న్యూఢిల్లీ: దేశంలోని కరోనా పరిస్థితులపై వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని నరేంద్ర మోదీ గురువారం కీలక సమావేశం నిర్వహించారు. కరోనా నియంత్రణ కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులకు కీలక సూచనలిచ్చారు. ముఖ్యంగా రాత్రి పూట ఏర్పాటు చేస్తున్న కర్ఫ్యూను ఇక మీదట నైట్ కర్ఫ్యూగా కాకుండా.. కరోనా కర్ఫ్యూగా పిలవాలని మోదీ సూచించారు. రాత్రి 9 లేదా 10 గంటల నుంచి తెల్లవారుజామున 5 లేదా 6 గంటల వరకు ఈ కర్ఫ్యూ కొనసాగేలా చూడాలని తెలిపారు. ఇప్పటికే కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రపంచ దేశాలన్నీ కరోనా కర్ఫ్యూను అవలంబిస్తున్నాయని, ఇప్పుడు మన దేశంలో కూడా అమలు చేయాల్సి ఉంటుందని ప్రధాని మోదీ చెప్పారు.

Updated Date - 2021-04-09T04:41:43+05:30 IST