మోదీ మెచ్చిన బార్బర్‌!

ABN , First Publish Date - 2020-06-01T07:41:23+05:30 IST

తన కుమార్తె చదువుల కోసం పొదుపు చేసిన రూ.5 లక్షల రూపాయలతో లాక్‌డౌన్‌ బాధితులకు సాయమందించిన మదురై సెలూన్‌ షాపు యజమాని మానవతా దృక్పథానికి ప్రధాని మోదీ జోహార్లు...

మోదీ మెచ్చిన బార్బర్‌!

  • మదురై సెలూన్‌షాపు యజమానిపై ప్రధాని ప్రశంసలు

చెన్నై, మే 31(ఆంధ్రజ్యోతి): తన కుమార్తె చదువుల కోసం పొదుపు చేసిన రూ.5 లక్షల రూపాయలతో లాక్‌డౌన్‌ బాధితులకు సాయమందించిన మదురై సెలూన్‌ షాపు యజమాని మానవతా దృక్పథానికి ప్రధాని మోదీ జోహార్లు అర్పించారు. ఆదివారం మన్‌కీ బాత్‌ కార్యక్రమంలో ప్రధాని మోదీ ఈ విషయాన్ని ప్రస్తావించారు. మదురైకి చెందిన మోహన్‌ అనే సెలూన్‌షాపు యజమాని తన కుమార్తె పైచదువుల కోసం పొదుపు చేసిన రూ.5లక్షలను లాక్‌డౌన్‌ బాధితుల సాయానికి ఖర్చుపెట్టడం అభినందనీయమని పేర్కొన్నారు. ప్రధాని తన పేరును ప్రస్తావించడంతో మోహన్‌ ఉబ్బితబ్బిబయ్యాడు.. పేదలు పడుతున్న కష్టాలను చూసి తన కుమార్తె నేత్ర చలించిపోయిందని, ఆమె చదువుకోసం దాచిన రూ.5లక్షలతో వారికి సాయం చేయాలని కోరిందనిమోహన్‌ తెలిపారు. ఆ సొమ్ముతో పేదలకు బియ్యం, నిత్యావసర వస్తువులు, ఆహార పొట్లాలను పంపిణీ చేశానని తెలిపారు.


Updated Date - 2020-06-01T07:41:23+05:30 IST