మోదీ చిత్ర పటానికి క్షీరాభిషేకం

ABN , First Publish Date - 2020-07-06T11:14:46+05:30 IST

ప్రధాని నరేంద్రమోదీపై అనుచిత వ్యాఖ్యలు చేయ డంతో పాటు అభ్యంతరకర ఫొటోలను సోషల్‌ మీడియాలో పెట్టడంతో ప్రధాని నరేంద్రమోదీ చిత్ర పటానికి

మోదీ చిత్ర పటానికి క్షీరాభిషేకం

నస్రుల్లాబాద్‌, జూలై 5: ప్రధాని నరేంద్రమోదీపై అనుచిత వ్యాఖ్యలు చేయ డంతో పాటు అభ్యంతరకర ఫొటోలను సోషల్‌ మీడియాలో పెట్టడంతో ప్రధాని నరేంద్రమోదీ చిత్ర పటానికి వారిచే ఆదివారం నస్రుల్లాబాద్‌ మండ ల కేంద్రంలో మోదీ చిత్రపటానికి బీజేపీ నాయకులు క్షీరాభిషేకం చేయించా రు. నస్రుల్లాబాద్‌ మండలంలోని బస్వాయిపల్లి గ్రామానికి చెందిన జాకీర్‌ అనే యువకుడితో పాటు దుర్కి గ్రామానికి చెందిన షాదుల్లాలు గత రెండు రోజుల క్రితం ప్రధాని నరేంద్రమోదీ గురించి అభ్యంతరకర ఫొటోలు పెట్టడం తో పాటు అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు బీర్కూర్‌, నస్రుల్లాబాద్‌ మండలాల బీజేపీ నాయకులు జాకీర్‌, షాదుల్లాల అడ్రస్‌ను తెలుసుకుని వారిచే నస్రుల్లాబాద్‌ మండల కేంద్రంలో మోదీ చిత్ర పటానికి క్షీరాభిషేకం చేయించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండలాధ్యక్షుడు హన్మాండ్లు యాద వ్‌, నాయకులు శ్రీకాంత్‌, గంగాధర్‌, తదితరులున్నారు.

Updated Date - 2020-07-06T11:14:46+05:30 IST