రైల్వే మూడో లైను పనుల పరిశీలన
ABN , First Publish Date - 2021-06-24T03:12:19+05:30 IST
బిట్రగుంట సెక్షన్ పరిధిలో జరుగుతున్న రైల్వే మూడో లైన్ పనులను విజయవాడ రైల్వే సహాయక ఏడీఆర్ఎం శ్రీనివాస్, సీనియర్ సౌత్
బిట్రగుంట, జూన్ 23: బిట్రగుంట సెక్షన్ పరిధిలో జరుగుతున్న రైల్వే మూడో లైన్ పనులను విజయవాడ రైల్వే సహాయక ఏడీఆర్ఎం శ్రీనివాస్, సీనియర్ సౌత్ డీఈఈఎన్ సూర్యప్రకాశ్రావులు బుధవారం తనిఖీ చేశారు. గూడూరు స్టేషన్ నుంచి బిట్రగుంట వరకు ప్రత్యేక రైల్లో మూడో లైన్ పనులు పరిశీలించిన వారు బిట్రగుంట రైల్వే స్టేషన్ ఉత్తరాన పనులు పూర్తి కావస్తున్న లాంగ్ లూప్ లైన్ పనుల తీరుపై అధికారులను అభినందించారు. రానున్న రోజుల్లో రెండు గూడ్సురైళ్ల నిలుపుదలకు ఏర్పాటు చేస్తున్న లైన్ల చిత్ర పట్టానికి అనువుగా జరుగుతున్న పనులు త్వరగా పూర్తి అయేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. బిట్రగుంట నుంచి పడుగుపాడు రైల్వే స్టేషన్ వరకు పూర్తి అయిన పనులు, బిట్రగుంట, తలమంచి స్టేషన్ల మద్య జరగాల్సిన పనులపై అధికారులతో చర్చించి జూలై నెలకు పూర్తి చేయాలని తెలిపినట్లు సమాచారం. ఆయన వెంట సీనియర్ డీవోఎం ఆంజనేయులు, సీనియర్ డీఈఈ, డీఎస్టీఈ బిట్రగుంట పీడబ్ల్యూఐ హుసేన్, ఆర్పీఎఫ్ సిబ్బంది తదితరులు ఉన్నారు.