వైభవంగా మోదకొండమ్మ ఉత్సవాలు ఆరంభం

ABN , First Publish Date - 2022-05-16T05:38:29+05:30 IST

పాడేరు మోదకొండమ్మ ఉత్సవాలు ఆదివారం వైభవంగా ప్రారంభమయ్యాయి.

వైభవంగా మోదకొండమ్మ ఉత్సవాలు ఆరంభం
ఉత్సవ విగ్రహం, పాదాలు, ఘటాలు తలకెత్తుకున్న కలెక్టర్‌, పీవో, సబ్‌కలెక్టర్‌, జడ్పీ చైర్మపర్సన్‌, ఎమ్మెల్యేలు

శతకంపట్టులో కొలువుతీరిన అమ్మవారు  



పాడేరు, మే 15(ఆంధ్రజ్యోతి): పాడేరు మోదకొండమ్మ ఉత్సవాలు ఆదివారం వైభవంగా ప్రారంభమయ్యాయి. జిల్లా కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించి, ఉత్సవ విగ్రహాన్ని శిరస్సుకెత్తుకుని ఉత్సవాలను లాంఛనంగా ప్రారంభించారు. ఆలయ కమిటీ చైర్‌పర్సన్‌ కె.భాగ్యలక్ష్మి, ప్రధాన కార్యదర్శి కొట్టగుళ్లి సింహాచలంనాయుడు, ఐటీడీఏ పీవో రోణంకి గోపాలక్రిష్ణ, సబ్‌ కలెక్టర్‌ వి.అభిషేక్‌, జడ్పీ చైర్‌పర్సన్‌ జల్లిపల్లి సుభద్ర, అరకులోయ ఎమ్మెల్యే ఫాల్గుణ, తదితరులు అమ్మవారి ఘటాలు, పాదాలను శిరస్సుపై పెట్టుకుని, భారీ ఊరేగింపుతో  శతకంపట్టు తీసుకువెళ్లి కొలువుతీర్చారు. అనంతరం భక్తులు పసుపు, కుంకుమ సమర్పించి పూజలు చేశారు. మూడు రోజులపాటు ఇక్కడ పూజలు నిర్వహిస్తారు. మంగళవారం అమ్మవారి ఉత్సవ విగ్రహం, పాదాలను భారీగా ఊరేగింపుతో తిరిగి ఆలయానికి చేరుస్తారు. 

Updated Date - 2022-05-16T05:38:29+05:30 IST