నిరాడంబరంగా మోదకొండమ్మ జాతర

ABN , First Publish Date - 2021-05-17T05:07:55+05:30 IST

కొవిడ్‌ నేపథ్యంలో మోదకొండమ్మ జాతర ఆదివారం నిరాడంబరంగా ప్రారంభమయింది.

నిరాడంబరంగా మోదకొండమ్మ జాతర
మోదకొండమ్మకు పూజలు నిర్వహిస్తున్న ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి, ఆర్డీవో కేఎల్‌.శివజ్యోతి తదితరులు

పాడేరు, మే 16: కొవిడ్‌ నేపథ్యంలో మోదకొండమ్మ జాతర ఆదివారం నిరాడంబరంగా ప్రారంభమయింది.  ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి దంపతులు, ఆర్డీవో కేఎల్‌ శివజ్యోతి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. కొవిడ్‌ ప్రభావంతో జాతర మూడు రోజులు భక్తులు తమ ఇళ్లల్లోనే పూజలు చేసుకోవాలని ఆలయ కమిటీ సూచించింది. దీంతో ఎమ్మెల్యే కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి, ఏపీ మెడికల్‌ కౌన్సిల్‌ సభ్యుడు డాక్టర్‌ టి.నరసింగరావు, ఆర్డీవో కేఎల్‌.శివజ్యోతి ఆదివారం తెల్లవారుజామునే అమ్మవారిని దర్శించుకున్నారు. ప్రధానార్చకులు సుబ్రహ్మణ్యం వారితో ప్రత్యేక పూజలు చేయించారు. ఉత్సవ కమిటీ ప్రతినిధులు కొట్టగుళ్లి సింహాచలంనాయుడు, ఎస్‌.నాగేశ్వరరావు, కె.నాగభూషణం తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-05-17T05:07:55+05:30 IST